Nishanth's World

Flag Counterhttps://www.amazon.in/gp/product/B01LWYDEQ7/ref=as_li_qf_asin_il_tl?ie=UTF8&tag=ramakrishn068-21&creative=24630&linkCode=as2&creativeASIN=B01LWYDEQ7&linkId=ca14743cf3c9ba7f73f108ca8b4c6f2b

chitika

https://www.amazon.in/gp/product/B01LWYDEQ7/ref=as_li_qf_asin_il_tl?ie=UTF8&tag=ramakrishn068-21&creative=24630&linkCode=as2&creativeASIN=B01LWYDEQ7&linkId=ca14743cf3c9ba7f73f108ca8b4c6f2b

My Blog List

chitika

chitika

Showing posts with label Nishanth Temples and Tourist Places. Show all posts
Showing posts with label Nishanth Temples and Tourist Places. Show all posts

Sunday, 26 October 2014

BRIEF HISTORY ABOUT SRI VARASAHITHA SRIMUKHALINGESWARA SWAMY TEMPLE, SRIMUKHALINGAM, SRIKAKULAM DISTRICT


శ్రీకాకుళం సమీపంలో ఉన్న వేయి సంవత్సరాల పైగా చరిత్ర కలిగిన అత్యంత పురాతన దేవాలయం: వారాహి సమేత శ్రీముఖలింగేశ్వరస్వామి వారి ఆలయం, శ్రీముఖలింగం, శ్రీకాకుళం జిల్లా

చరిత్ర చూస్తే దాని పేరు కళింగనగరం. ఖారవేలుని రాజ్యానికి రాజధాని ఈ కళింగనగరం. సుమారు క్రీశ ఏడవ శతాబ్దం వరకు కళింగసీమ పాలకులకు ఇదే రాజధాని. కానీ ప్రస్తుతం కేవలం ఒక పుణ్య క్షేత్రంగా ఉత్తరాంధ్రలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, అతి పురాతన దేవాలయం అయిన శ్రీముఖలింగం నిర్మాణంలోను, చెక్కడాలలోను, శిల్ప సౌందర్యంలోను అడుగడుగునా ఉత్కళ సంప్రదాయం కనపడుతుంది. చాలా అరుదుగా కనిపించే యమ, ఇంద్రాది దిక్పాలకుల ఆలయాలు కూడా ఇక్కడమనం చూడవచ్చు. ఇక్కడ స్వామి ముఖలింగేశ్వరుడు, మధుకేశ్వరునిగా, జయంతేశ్వరునిగా భక్తుల ఆరాధనలందుకుంటున్నాడు.
గ్రహాలలో అత్యంత శక్తివంతుడుగా ఎటువంటి వారినైనా భయపెట్టగలవానిగా చెప్తారు శనిదేవుడిని. అలాంటి శనిదేవుడు ఒక సందర్భంలో సాక్షాత్తు ఆ పరమేశ్వరునితోనే సవాలు చేసాడట. ‘నిన్ను తప్పకుండా పట్టుకుంటాన‘ని. ఆ శక్తి నీకు లేదన్నాడట శివుడు. ఈ విషయంమీద ఇద్దరికీ వాదన పెరిగింది. ‘‘సరే! ఎలా పట్టుకుంటావో చూస్తానంటూ చెట్టుతొర్రలో చేరిపోయాడట భోళాశంకరుడు. ఆ తరువాత నన్ను ఎలాగైనా పట్టుకుంటానన్న నీ శక్తి ఏమైందన్నాడు శివుడు శనీశ్వరునితో. దానికి శనిదేవుడు ఎంతమాత్రం బెదరకుండా నిదానంగా నవ్వుతూ ‘‘నా ప్రభావం కారణంగా కాకపోతే పరమేశ్వరుడవయిన నీవు ఒక చెట్టు తొర్రలో వుండవలసిన ఖర్మ ఏమిటి!? ఇదంతా నా ప్రభావం వల్లనే కదా!’ అన్నాడట శనిదేవుడు. అలా పరమేశ్వరుని ముఖంతో ఏర్పడ్డ ఆ చెట్టు తొర్రే నేటి ముఖ లింగేశ్వరుడు అన్నది ఒక పురాణ కథనం.

మరొక కథనం ప్రకారం నామదేవుడు చేసిన యజ్ఞానికి దేవతలందరూ తరలి వస్తారు. ఆ సందర్భంలో జరిగిన నాట్య ప్రదర్శనలో మోహావేశపరవశుడైన చిత్రసేనుడనే గంధర్వుడు సభా మర్యాదను త్రోసిరాజని, ఉచితానుచితాలు మరిచిపోయి ఆ స్ర్తిలతో నాట్యంలో మునిగిపోయాడట. అతడియొక్క అనుచితమైన ప్రవర్తనకు ఆగ్రహించిన పరమేశ్వరుడు, ఉన్నతమైన సంస్కారంతో మెలగవలసిన గంధర్వుడవయిన నీవు సంస్కారంలేని ఒక కిరాతుడిలా అవివేకిలా ప్రవర్తించిన కారణంగా కిరాతుల ఇళ్లలో పుట్టమని శపించాడట. దాంతో తానున్న స్థితినుంచి బయటపడి తన తప్పును తెలుసుకున్న గంధర్వుడు కరుణించమని శివునిముందు మోకరిల్లాడు. ఇతని వేడుకోళ్లకు కరిగిపోయిన ఆ భోళాశంకరుడు, విప్పచెట్టునుంచి మధుకేశ్వరునిగా ఉద్భవించే తనను చూడగానే శాపవిమోచనం కలుగుతుందని కరుణించాడట. శాపప్రభావంతో గంధర్వుడు కిరాతుడిగా పుట్టాడు. కిరాత కన్యను, జంగమ స్ర్తిని వివాహమాడి జీవనం కొనసాగిస్తున్నాడు. తన జన్మ సంస్కారం వలన భగవద్భక్తితో మనుగడ సాగిస్తోంది జంగమస్ర్తి. విప్పచెట్టుని భగవంతుడిగా భావించి ప్రతినిత్యం ఆ విప్పచెట్టుకి పూజలు చేస్తూ సాక్షాత్తు పరమేశ్వరునిగా ఆరాధిస్తోంది జంగమస్ర్తి, సహజంగానే ఆమె సంస్కారానికి, మంచి తనానికి ముగ్ధుడై ఈమెవైపు ఆకర్షితుడయ్యాడు కిరాతునిగా వున్న గంధర్వుడు. దాంతో అసూయతో రగిలిపోయింది కిరాతుని మరో భార్య అయిన కిరాత స్ర్తి. ఏదో ఒక విధంగా ఆమెను బాధించి తన కసి తీర్చుకోవాలనుకుంది. అందుకామెకు ఒకే ఒక్క మార్గం కనపడింది. తన సవతి నిత్యం భక్తిశ్రద్ధలతో పూజించే విప్పచెట్టుని లేకుండా చేస్తే ఆమెకు సరైన గుణపాఠం అనుకున్న ఆ కిరాతురాలు ముందు వెనకలు ఆలోచించకుండా ఆ విప్పచెట్టును నరికేసింది. ఆసమయంలో ఆ చెట్టుతొర్రలోనుండి మధుకేశ్వరునిగా ఆవిర్భవించాడు పరమేశ్వరుడు. ఆ దృశ్యాన్ని చూసిన కిరాతునికి శాప విమోచనం కలిగి తన గంధర్వలోకానికి చేరుకున్నాడు. ఆ చెట్టుతొర్రె నేడు ప్రధాన ఆలయంలో ఆరాధించబడుతున్న మూలవిరాట్టు అని స్థలపురాణం చెప్తోంది. మూలవిరాట్టుకి కాస్త వెనకగా ఒక పెద్ద మట్టిగోలెం చూడవచ్చు. ఆ భోళాశంకరుడు భక్తులను ఎంత త్వరితంగా కరుణిస్తాడో..వరాలను కురిపిస్తాడో...ఒక్కోసారి అంతగాను పరీక్షలకు గురి చేస్తాడనీ...అయితే చివరకు భగవద్భక్తే గెలుస్తుందని భక్తుల ఆర్తికి ఆ పరమేశ్వరుడు దిగిరాక తప్పదన్న వాస్తవానికి నిదర్శనమే ఈ గోలెం.

నాగన్న అనే కుమ్మరి గొప్ప శివభక్తుడు. నాగన్నకు వున్న లోటంతా ఒక్కటే. సంతానం లేకపోవడం. ఆ సంతానం కోసం పరమేశ్వరుడుని పరిపరి విధాల వేడుకున్నాడు. తనకు సంతానాన్ని ప్రసాదిస్తే తన శక్తికొద్దీ రెండు గోలేలను సమర్పించుకుంటానని మొక్కుకున్నాడు. భగవత్కృపతో సంతానాన్ని పొందిన నాగన్న తన మొక్కు ప్రకారం గోలేలను చేసి శ్రీ ముఖలింగ్వేరునికి సమర్పించడం కోసం తీసుకువచ్చాడు. కాని ద్వారానికంటే వెడల్పుగా వుండడంవల్ల వాటిని లోనికి తీసుకుపోవడం కుదరలేదు. సరేనని మళ్లీ కొత్త గోలేలను తయారుచేసాడు. కానీ మళ్లీ మొదటి పరిస్థితే. ఇలా ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం శూన్యమే. మొక్కు తీర్చడం కోసం తను చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవడంతో ఇదంతా తన భక్తిలో లోపమేనని, ఆ కారణంగానే తన మొక్కును పరమేశ్వరుడు స్వీకరించడంలేదని భావించిన నాగన్న తన ప్రాణాలనే వదలడానికి సిద్ధపడ్డాడు. చివరిగా ఒక్కసారి ప్రయత్నించి చూద్దామనుకున్నాడు. విచిత్రం ఏమంటే అతడలా అనుకోగానే అంతకుముందు పెద్దవై లోనికి తీసుకుపోవడానికి సాధ్యం కాని ఆ గోలేలు చాలా చక్కగా లోపలకు తీసుకువెళ్లగలిగాడట. ఇదంతా పరమేశ్వరుని కరుణకు, నాగన్న భక్తికి నిదర్శనంగా చెప్తారు. ఆ జ్ఞాపకంగానే ఆ కథనానికి చిహ్నంగానే ఆ గోలేలను మూలవిరాట్టుకు వెనకగా వుంచినట్టు ఒక కథనం. అతి ప్రాచీన పుణ్యక్షేత్రంగా ఒకప్పటి వైభవానికి చిహ్నంగా వున్న శ్రీ ముఖలింగం శ్రీకాకుళం జిల్లాలో వుంది.శ్రీకాకుళంనుంచి శ్రీముఖలింగం బస్సులో చేరుకోవచ్చు.

Monday, 15 September 2014

ARTICLE ABOUT INFORMATION OF LORD SIVA'S FIVE TEMPLES - PANCHA BHUTHA LINGALU AND ITS HISTORY


పంచభూతలింగాల గురించి మీకు తెలుసా?

పంచభూతలింగాల గురించి మీకు తెలుసా? అయితే ఈ కథనం చదవండి. పరమేశ్వరుడు లింగరూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. ఆ లింగరూపాన్ని దర్శించుకునే వారికి సకలసంపదలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. అందులో కీలకమైన పంచలింగాలు. పృథ్విలింగం, ఆకాశలింగం, జలలింగం, తేజోలింగం, వాయులింగములను పంచభూతలింగాలు అంటారు.

1. పృథ్విలింగం: 

ఇది మట్టిలింగం. కంచిలోఉంది. ఏకాంబరేశ్వర స్వామి అంటారు. పార్వతీదేవిచే ఈ లింగం ప్రతిష్టించబడినది. ఇక్కడున్న అమ్మవారి పేరు కామాక్షీదేవి. అష్టాదశ పీఠాలలో ఇది ఒకటి.

2. ఆకాశలింగం:

ఇది తమిళనాడులోని చిదంబర క్షేత్రంలో ఉన్నది. ఆకాశలింగ దర్శనం రహస్యమైనది. ఆకాశంవలే శూన్యంగా కనిపిస్తుంది. లింగ దర్శనముండదు. అందువల్లనే చిదంబర రహస్యం అనే పేరు వచ్చినది. ఈ క్షేత్రంలో నటరాజస్వామి, శివకామ సుందరి అమ్మవార్లు మాత్రమే ఉంటారు.

3. జలలింగం:-

ఈ లింగం క్రింద ఎప్పుడూ నీటి ఊట ఉండటం వలన దీనిని జలలింగం అంటారు. ఇది తమిళనాడులోని తిరుచురాపల్లికి సమీపంలో జంబుకేశ్వర క్షేత్రంలో ఉంటుంది. ఈ స్వామి పేరు జంబుకేశ్వరుడు. అమ్మవారి పేరు అఖిలాండేశ్వరి. బ్రహ్మహత్యా పాతక నివారణకోసం పరమేశ్వరుడు జంబూక వృక్షం క్రింద తపస్సు చేసినందుకే ఇక్కడి శివునికి జంబుకేశ్వరుడని పేరువచ్చెను.

4. తేజోలింగం:

తమిళనాడులోని అరుణాచలంలో తిరువన్నామలై క్షేత్రంలో తేజోలింగం ఉన్నది. అరుణాచల శిఖరాగ్రంపై అగ్నిశిఖ ఒకటి ఆవిర్భవించి తేజోలింగ రూపమయ్యాడు శివుడు. ఈయన పేరే అరుణాచలేశ్వరుడు. అమ్మవారి పేరు అరుణాచలేశ్వరి.

5. వాయులింగం:

ఆంధ్రప్రదేశ్ తిరుపతికి దగ్గరలోని శ్రీ కాళహస్తీశ్వరస్వామి ఆలయంలోని లింగమే వాయులింగం. ఈయన పేరు కాళహస్తీశ్వరుడు. అమ్మవారి పేరు ఙ్ఞానప్రసూనాంబ. సాలెపురుగు, పాము, ఏనుగులకు మోక్షము ప్రసాదించిన క్షేత్రం. ఇవే పంచభూతలింగాలుగా ప్రసిద్ధి చెందినవి.

Thursday, 11 September 2014

ARTICLE ABOUT SRIMUKHA LINGAM TEMPLE AT SRIKAKULAM DISTRICT - ANDHRA PRADESH - INDIA



మోక్షకారకం... శ్రీముఖలింగం

దేశంలో పవిత్ర పుణ్యక్షేత్రల్లో ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం శ్రీముఖ లింగం పుణ్యక్షేత్రం ఒకటి. దక్షిణ కాశీగా పిలవబడుతున్న ఈ క్షేత్రం శాసనాల్లో లిఖించబడింది. ఎంతో చరిత్ర కలది. మానవ జన్మకి మోక్షం కలగాలంటే శ్రీముఖలింగం దర్శించాలని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ అద్భుత నిర్మాణాలు, అపురూప శిల్ప సంపద కలదు.
వంశధార నదీ తీరాన గల శ్రీముఖ లింగంలో ప్రధాన దేవాలయం మధుకేశ్వరనితోపాటు భీమునిచే ప్రతిష్టించబడిన భీమేశ్వర ఆలయం, చంద్రునిచే ప్రతిష్ఠించబడిన సోమేశ్వర ఆలయాలు ఉన్నాయ. దేశంలో ఏ ఆలయాలలో చూసినా శివుడు లింగాకారంలో దర్శనం ఇస్తాడు. దీనికి భిన్నంగా శ్రీముఖ లింగంలో ముఖాకారంలో దర్శనం ఇవ్వడం గొప్ప విశేషం.
ఆలయ ప్రాంగణంలో శిల్ప సంపద ఏక రాతిపై కనిపించి చూపరులను ఆకట్టుకుంటాయి. అరుణాచలంలో నిర్మాణమైవున్న శిల్ప సంపదను తలపించే విధంగా ఆలయంలో పార్వతీ పరమేశ్వరుని శిల్పాలు కనిపిస్తాయి. ఈ సన్నివేశం అక్కడ అరుణాచలంలోను, శ్రీముఖ లింగంలోను తప్ప మిగిలిన ప్రాంతాల్లో ఎక్కడా కనిపించవు.
శివపార్వతులు ఎరుపు రంగు రాతిపై ఉత్తర ముఖంగా ఉండడం విశేషం. గర్భగుడిలో ఒక చోట కూర్చుని చూస్తే గణపతి, సూర్యనారాయణ, అమ్మవారు, విష్ణుమూర్తి, శివుడు కనిపిస్తారు. అందుకే దీనిని పంచాయత క్షేత్రమని పురాణాలు తెలియజేస్తున్నాయి. శ్రీముఖ లింగంలో అష్టగణపతులున్నారు.
వ్యాసమహర్షి భారతముతోపాటు పంచమవేద గ్రంథాలు వ్రాయుటకు ముందు వ్యాస గణపతిని ప్రతిష్టించి ప్రారంభించినట్టు దీనితోపాటు శక్తిగణపతి, చింతామణి గణపతి, దుండి గణపతి, సాక్షి గణపతి, బుద్ధి గణపతి, తాండవ గణపతి(నాట్య), సిద్ధి గణపతులు దర్శనం ఇస్తారు. ఇక్కడ కోటి లింగాలకు ఒకటి తక్కువ అని చరిత్ర చెబుతుంది.
6, 4, 8వ శతాబ్దాల నాటి ఆలయాలుశ్రీముఖ లింగంలో ఆలయాలు 6,4,8వ శతాబ్దాలలో నిర్మాణాలు జరిగినట్టు శాసనాల్లో ఉన్నాయి. ఆరవ శతాబ్దంలో ప్రధాన దేవాలయం మధుకేశ్వరుని, నాలుగో శతాబ్దంలో భీమేశ్వర ఆలయం, ఎనిమిదో శతాబ్దంలో సోమేశ్వర ఆలయాలు నిర్మించబడ్డాయి. కొంతకాలం అనంతరం శిథిలమైన ఆలయాలను రెండువందల ఏళ్ల క్రితం పర్లాకిమిడి మహారాజ్ గజపతి వంశీయులు పునర్నిర్మించారు. అప్పటినుంచి వారి సమక్షంలో ఆలయ సంరక్షణ జరుగుతోంది.
మహాశివరాత్రి పర్వదినాన లింగోద్భవ కార్యక్రమాన్ని నేటికీ మహారాజ వంశీయులు నిర్వహిస్తుంటారు.
* స్వప్నేశ్వర లింగం
ఇటీవలి కాలంలో ఇళ్ల నిర్మాణం కోసం ఒక వ్యక్తి తవ్విన పునాదుల్లో స్వప్నేశ్వర లింగం బయటపడింది. శతాబ్దాల క్రితం ఇక్కడ స్వప్నేశ్వర ఆలయం ఉండేదని చరిత్ర ద్వారా రుజువైంది. ఎటువంటి దుస్వప్నాలు వచ్చినా ఈ స్వామిని దర్శిస్తే తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి.
* విప్ప(మధు)చెట్టు
ప్రధాన దేవాలయంలో ముఖాకారంగా దర్శనం ఇస్తుంది. దీనిని మధుకేశ్వర స్వామిగా పిలుస్తారు. శతాబ్దాల క్రితం కీకారణ్యంగా వుండే ఈ ప్రాంతంలో విప్ప (మధు) చెట్టును చిత్రసేనుడు అను కోయరాజు శివుడిని స్మరించి పూజించేవాడు. ఆయనకి చిత్తి, చిక్కల అనే ఇద్దరు భార్యలు ఉండేవారు. సవతుల పోరు భరించలేక ఒకరోజు చిత్రసేనుడు మధువృక్షమును గొడ్డలితో నరికివేయడంతో అగ్నిజ్వాలలు లేచి అందునుండి శివుడు ముఖ దర్శనం ఇచ్చినట్టు చరిత్ర తెలియజేస్తోంది.
ఇంతటి చరిత్ర కలిగిన పుణ్యక్షేత్రాన్ని పరిరక్షించాల్సిన ప్రభుత్వాలు అలసత్వం చూపుతున్నారని భక్తులనుంచి విమర్శలు వినిపిస్తున్నాయి.
* జాతరలు
మహాశివరాత్రి మూడురోజుల జాతర మహాశివరాత్రి మొదలుకుని నాలుగో రోజు చక్రతీర్ధ స్నానముతో ముగుస్తుంది. మహాశివరాత్రి పర్వదినముతోపాటు ప్రతి ఏటా కార్తీక మాసం నాలుగు సోమవారాలు, మిగతా పవిత్ర దినాల్లో భక్తులు దర్శించి ప్రత్యేక పూజలు చేపడతారు. పర్యాటక ప్రదేశంగా ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని గుర్తించినా కనీస వౌలిక సదుపాయాలు లేకపోవడం శోచనీయం. ఇంతటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాన్ని పాలకులు పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.

Friday, 5 September 2014

LORD BRAHMADEV'S TEMPLE AT CHEBROLU - GUNTUR DISTRICT - ANDHRA PRADESH - HAVING 2000 YEARS HISTORIC AGE


1. గుంటూరు జిల్లాలో రెండు వేల సంవత్వరాల వయస్సు కలిగిన ఆలయం... 

2. పల్లవ, చాళుక్య, చోళ చరిత్రకు సంబంధించిన అవశేషం...

3. ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న ఏకైక బ్రహ్మ దేవాలయం...

4. ఒకే ఊరిలో నూటొక్క దేవాలయాలు...

భృగు మహర్షి శాప కారణంగా బ్రహ్మ దేవునికి ఎక్కడా ఆలయాలు ఉండవు.. కానీ కాశీ లో ఒక ఆలయం ఇక్కడ గుంటూరు జిల్లాలోని చేబ్రోలులో ఒక ఆలయం ఉంటాయి... ఈ చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వరస్వామి ఆలయం చుట్టూ కోనేరుతో మధ్యలో ఆలయం తో చూడముచ్చటగా ప్రశాంతంగా ఉంటుంది... శివలింగంలో నాలుగు దిశలా నాలుగుముఖాలతో బ్రహ్మ ఇక్కడ కొలువైయ్యాడు...

ఈ ఆలయం వేయి సంవత్సరాలచరిత్ర కలిగినదని... ఆ సమయంలో ఈ ప్రదేశాన్ని చాళుక్య చోళులు పరిపాలించేవారు... తూర్పు చాళుక్యులకు చెందిన సత్యశ్రాయుడు తన సేనాధిపతి బయనంబిని దండయాత్రకై పంపించాడు.. ఆయన చాళుక్యచోళులకు సంబంధించిన ధరణికోట(అమరావతి)ని యనమదల కోటలను ఓడించి తన సామ్రాజ్యానికి ముఖ్యపట్టణంగా చేబ్రోలును ఎంపిక చేసుకుని ఇక్కడ పలు ఆలయాలు నిర్మించాడు...
చాలావరకు ఆల యాలు చరిత్ర గతిలో కలసినా ఆంధ్రుల శిల్పకళా ప్రాభ వాన్ని చాటి చెప్పే దేవాలయాలింకా కొన్నిక్కడ మిగిలి ఉన్నాయి. సరస్సు మధ్యలో బ్రహ్మదేవుడి కొక ఆలయం -ఆ చతుర్ముఖుని నాలుగు ముఖాల మధ్యలో శివ లింగం అద్భుతంగా ఉన్నాయి. బ్రహ్మేశ్వర లింగంగా ఇది ప్రసిద్ది చెందింది. ఇదేకాక సహస్ర లింగేశ్వర స్వామి, వీరభద్రస్వామి ఆలయాలు కూడా ఉన్నాయి. నాగేశ్వర ఆలయం, భీమేశ్వర ఆలయం, నంది విగ్రహం కూడా ఉన్నాయి. ఇక్కడి అమ్మవారు రాజ్యలక్ష్మి. ఈ ఆలయం క్రీ.శ. మొదటి శతాబ్దం నుంచీ ఉన్నదనటానికి చారిత్రక ఆధారాలు ఇక్కడ దొరికిన నాణాలు. తొట్ట తొలుత ఈ క్షేత్రం పేరు తాంబ్రావ, తాంబ్రాప. క్రమంగా అది చేబ్రోలు అయింది. లోహ యుగపు మొదలులో ఇక్కడ తామ్ర లోహం చాలా విరివిగా దొరికేదట...ఇక్కడ రాగి, తామ్రం తో కూడిన తయారీ పనివారు ఉండే వారట... అలా తామ్రమును సంస్కృతంలో ‘చెం’ అని అంటారని...(చిన్న చిన్న రాగి, ఇత్తడి లోటాలను/డొక్కులను చెంబులు అంటారు) ఈ చెంబులు తయారీ అయే పేరు కాస్తా చేబ్రోలు అయిందని వినికిడి... 

మొదట ఇక్కడ కుమార స్వామికి గుడి, పూజ ఉండేవిట. అప్పట్లోనే చౌడేశ్వర, గణపేశ్వర ఆల యాలు నిర్మించారు. తర్వాత భీమేశ్వర ఆలయం. 

ఈ భీమేశ్వరాలయం క్రీ.శ. రెండవ శతాబ్ది కి చెందినదని... ఈ గుడికి జీర్ణోద్ధారణ ప్రక్రియ నిమిత్తం బాగుచేస్తుండగా రెండువేల ఏళ్ళ సంవత్సరాల క్రితం శివలింగం నంది విగ్రహాలు బయటపడ్డాయి... ప్రస్తుతం పురావస్తు శాస్త్రజ్ఞులు చాలా జాగ్రత్తగా పనులు చేస్తున్నారు.. ఇక్కడే పన్నెండు అడుగుల నటరాజ విగ్రహం ఉండేదట కానీ ప్రస్తుతం ఆ ఆలయమూ లేదు దాని ఆనవాళ్ళు కూడా లేవు అక్కడ. కానీ ఆలయముందు భాగంలో ఉండవలసిన ఒక పెద్ద నంది విగ్రహం మాత్రం ఉంది... ఇటువంటి పురాతన సంస్కృతికి సంబంధించిన అవశేషాలను ఆనవాళ్ళను కాపాడుకోవడంలో మన ఆంధ్రులం కొంచెం వెనుకపడ్డామనే చెప్పుకోవచ్చు.. ఈ విషయంలో తమిళులను ఆదర్శంగా తీసుకుంటే చాలా వృద్ధి సాధించవచ్చు..

కొన్ని వేల ఏళ్ళ చరిత్ర కలిగిని ఈ చేబ్రోలు (నూటొక్క గుడులు)దేవాలయాల పునరుద్ధరణకు ప్రభుత్వం పూనుకుంటే గుంటూరు జిల్లా టూరిజం బాగా వృద్ధి చెందుతుందనుటలో ఎటువంటి సందేహం లేదు...

ARTICLE ABOUT LEPAKSHI TEMPLE AND HANGING PILLAR - WONDERS ABOUT INDIAN TEMPLES


లేపాక్షీ-శిల్పకళా నైపుణ్యానికి మెచ్చుతునక వేళ్ళాడే స్థంభం 

(wonders in Indian Temples)

లేపాక్షీ దేవాలయ నిర్మాణం శ్రీ కృష్ణదేవరాయల వంశానికి చెందిన సాళువ నరసింహరాయల కాలంలో విరూపాక్షుని ఆధ్వర్యంలో జరిగింది... ఇది ఎన్నో అద్భుతాలకు నిలయం.. 

ఇప్పుడు మీరు చూస్తున్న మూడు చిత్రాలలో మొదటిది.. వేళ్ళాడే స్థంభం పూర్తి రూపం... అంటే ఈ స్థంభం కేవలం పై కప్పు ఆధారంగా చేసుకుని వేళ్ళాడుతూ ఉంటుంది... క్రింద నేల నుండి ఒక సెంటీమీటరు ఖాళీ (మూడవచిత్రాన్ని చూడండి)ఉంటుంది... ఆ ఖాళీ నుండి మన చీర కొంగును ఇవతల నుండి అవతలకు(రెండవ చిత్రంలో చూపినవిధంగా) చాలా సులభంగా దూర్చవచ్చన్న మాట...
అయితే మన హిందూ దేవాలయాలను పూర్తిగా కొల్లగొట్టాలని వచ్చిన కొంత మంది తురుష్కులు ఈ స్థంభాన్ని ధ్వంసం చేయాలని ప్రయత్నించారట... అయితే వారి ప్రయత్నంలో ఆలయం క్రుంగటం కనపడిందట.. ఒకవేళ ఆ స్థంభాన్ని తొలగించినట్లయితే పూర్తిగా ఆలయం నేలమట్టమవుతుంది.. ఆ ప్రయత్నం లో అంతా సమాధి అవుతారని భయపడి వెనక్కు తగ్గారట... ఎందుకంటే ఆలయ పూర్తి భారం(గరిమనాభి) ఈ స్థంభం దగ్గర వచ్చే విధంగా ఈ ఆలయాన్ని నిర్మించారు.. ఎంతటి నిర్మాణ కౌశలత్వం(ఇంజనీరింగ్ ఎఫిసియెన్సీ) అంతటి కౌశల్యాన్ని చూసిన తురుష్కులకు నోట మాట రాలేదట.. చివరికి ఏమీ చేయలేక కనపడిన విగ్రహాన్నెల్లా ధ్వంసం చేసారు కానీ.. ఈ స్థంభాన్ని మాత్రం ఏం చేయలేకపోయారు... 

వీలుంటే లేపాక్షీ ఆలయాన్ని దర్శించండి... ఇది అనంతపురం జిల్లా...హిందుపురానికి పది కిలోమీటర్ల దూరంలో ఉంది..

Thursday, 20 February 2014

TELUGU GODDESS TALAPULAMMA SITUATED NEAR TUNI, ANDHRA PRADESH - INDIA - A GREAT TOURIST SPOT AROUND THE FOREST





ARTICLE ON GODDESS "BAHUCHAR MATHA" HAVING HER VEHICLE IS HEN - ALMOST ALL THE GUJARATI/INDIANS WORSHIPS THIS GODDESS - BRIEF FACTS AND HISTORY OF GODDESS "BAHUCHAR MATHA"



SUMMER SPECIAL - AACHALESHWAR TEMPLE AT RAJASTHAN - INDIA - LORD SHIVA TEMPLE - HAVING NO SHIVA LINGAM TO PERFORM POOJA - DIFFERENT TEMPLE - MUST VISIT


MOST ANCIENT PLACE THAN KAASI IS "BANAVASI" MADHUKESHWARA TEMPLE - SIRSI VILLAGE 20 KM - NORTH KANNAD DISTRICT - KARNATAKA - INDIA - SUMMER SPECIAL2013 PILIGRIM AND BEST TOURIST SPOT




WORLD FAMOUS APPANNA TEMPLE AT SIMHACHALAM - LORD NRUSIMHA SWAMY RESIDES - NEAR VISAKHAPATNAM, ANDHRA PRADESH, INDIA


FAMOUS TEMPLE AT MADHIKERA MANDAL IN KURNOOL DISTRICT ANDHRA PRADESH INDIA - GODDESS MADDEMMA THALLI - VERY FAMOUS AND EFFECTIVE GODDESS - MUST VISIT


LORD SITA RAMA TEMPLE AT SANGAM - ANDHRA PRADESH - HOW TO PERFORM LORD RAMA PUJA ? TIPS FOR PERFORMING LORD RAMA'S PRAYER AND PUJA IN TELUGU




LORD BHUDEVI-VARAHA SWAMY TEMPLE - LORD PRALAYA VARAHA NADHA TEMPLE SITUATED AT BANGALORE - MYSORE HIGH WAY 55 KM TO KRISHNA RAJA PET, NEXT KALA HALLI VILLAGE, KARNATAKA - INDIA - VERY FAMOUS LORD VARAHA NARASIMHA SWAMY TEMPLES IN INDIA


UJJAIN SRI MAHAKALESWARA / LORD SHIVA'S TEMPLE - BRIEF PROFILE OF ujjayini Temple - The Best Tourist Spot in India - Must Visit Dwadasa Jyothiringalu



Ujjain /ˈn/ About this sound listen  (also known as UjainUjjayiniAvantiAvantika,Avantikapuri), is an ancient city situated on the eastern bank of the Kshipra River(Hindi: क्षिप्रा) in the Malwa region of central India. The city is today part of the state ofMadhya Pradesh, and it is the administrative centre of Ujjain District and Ujjain Division.
In ancient times, the city was called Ujjayini. As mentioned in the Mahabharata epic, Ujjayini was the capital of the Avanti Kingdom. Traditionally exalted as one of the seven sacred cities (Sapta Puri) of the Hindus, Ujjain is one of the four sites that host theKumbh Mela (also called the Simhastha Mela), a quadrennial mass pilgrimage that attracts millions of Hindu pilgrims from around the country. It is also home to theMahakaleshwar Jyotirlinga, one of the twelve Jyotirlinga shrines to the god Shiva. An ancient seat of learning, Ujjain is the place where Lord Krishna, along with Balarama and Sudama, received his education from Maharshi Sandipani.
In Indian mythology, the origin of the city is ascribed to the act of Sagar Manthan, which refers to the churning of the primordial ocean performed by the demigods and demons to discover a pot containing the nectar of immortality. The story goes that after the nectar was discovered, a fierce struggle ensued between the demigods and the demons to obtain the nectar for the attainment of immortality. During the chase, a drop of nectar spilled and fell on Ujjain, thus making the city sacred. According to legend, the river Kshipra that flows across Ujjain is regarded to have originated owing to the churning of the gods and goddesses.[1]
Apart from the rich tapestry of myths and legends surrounding the city, Ujjain has stood witness to a long and distinguished history: it was home to legendary rulers including the renowned king Chandragupta II, great scholars such as Brahmagupta andBhaskaracharya, and literary gems like Kalidasa. Since the 4th century BCE, the city was considered the prime meridian by Hindu astrologers, and it was placed as the center of the world in numerous ancient world maps.[2]In the past, Ujjain was variously known as ArinAryn or Ozein to the outside world.

Golden Temple Amritsar , India


ANCIENT INDIA - THE CULTURE OF INDIA - ITS IMPORTANCE - IMPORTANT PLACES TO VISIT - A MAP OF TOURIST PLACES


chitika